నెల తిరగకుండానే ఓటీటీలోకి రవితేజ ‘మాస్ జాతర’!

  • నవంబర్ 28 నుంచి అందుబాటులోకి రానున్న సినిమా
  • ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్
  • థియేటర్లలో ఆకట్టుకోలేకపోయిన మాస్ మహారాజా చిత్రం
మాస్ మహారాజా రవితేజ నటించిన తాజా చిత్రం ‘మాస్ జాతర’ ఓటీటీలోకి వచ్చేస్తోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ ఈ సినిమా డిజిటల్ హక్కులను సొంతం చేసుకుంది. నవంబర్ 28 నుంచి ఈ చిత్రం స్ట్రీమింగ్ కానున్నట్లు అధికారికంగా ప్రకటించింది. థియేటర్లలో విడుదలైన నెల రోజులు కూడా గడవక ముందే ఈ సినిమా డిజిటల్ వేదికపైకి రావడం గమనార్హం.

రవితేజ కెరీర్‌లో 75వ చిత్రంగా ఎన్నో అంచనాల మధ్య ‘మాస్ జాతర’ అక్టోబర్ 31న థియేటర్లలో విడుదలైంది. అయితే, రొటీన్ కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద తీవ్రంగా నిరాశపరిచింది. భారీ అంచనాలను అందుకోలేక ఫ్లాప్‌గా నిలిచింది. భాను భోగవరపు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్‌గా నటించగా, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మించింది.

ఇటీవల ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్‌పై సోషల్ మీడియాలో పలు ఊహాగానాలు వచ్చాయి. దీంతో సినీ ప్రియుల్లో కొంత గందరగోళం నెలకొంది. ఈ క్రమంలో నెట్‌ఫ్లిక్స్ అధికారిక ప్రకటనతో స్పష్టత ఇచ్చింది. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ భాషల్లోనూ ఈ సినిమా అందుబాటులో ఉంటుందని నెట్‌ఫ్లిక్స్ తన ప్రకటనలో తెలిపింది. దీంతో థియేటర్లలో చూడలేకపోయిన ప్రేక్షకులు ఓటీటీలో చూసేందుకు సిద్ధమవుతున్నారు.

Ravi Teja
Mass Jathara
Netflix
Sreeleela
Bhanu Bogavarapu
Sitara Entertainments
OTT Release
Telugu Movie
Movie Streaming
Digital Rights

More Telugu News